TS News: విద్యుత్ సౌధ వద్ద విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా

ABN , First Publish Date - 2022-08-08T20:12:08+05:30 IST

విద్యుత్ సౌధ వద్ద విద్యుత్ ఉద్యోగులు మహాధర్నా చేపట్టారు.

TS News: విద్యుత్ సౌధ వద్ద విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా

హైదరాబాద్: విద్యుత్ సౌధ వద్ద విద్యుత్ ఉద్యోగులు (Power employees) మహాధర్నా చేపట్టారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లు(Electricity Act Amendment Bill)ను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగుల నిరసనకు దిగారు. విద్యుత్ ఉద్యోగుల ధర్నాకు  సీపీఎం తమ్మినేని వీరభద్రం (Tammineni veerabhadram) మద్దుతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్రం (Central government) తెస్తున్న విద్యుత్ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని మండిపడ్డారు. విద్యుత్ రంగంపై రాష్ట్రాలకు హక్కు లేకుండా చేస్తోందని అన్నారు. కేంద్ర బిల్లుతో దేశ ప్రజలందరికీ నష్టం చేకూరుతుందని తెలిపారు. ప్రజల జీవితాల్లో వెలుగులను చీకట్లు చేసేదే కేంద్ర విద్యుత్ చట్టమన్నారు. కేంద్ర విద్యుత్ చట్ట సవరణను వెంటనే వెనక్కి తీసుకోవాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-08-08T20:12:08+05:30 IST