మడ్యంవారిపల్లెలో తాగునీటి సమస్య

ABN , First Publish Date - 2020-08-10T11:19:02+05:30 IST

నిమ్మనపల్లె మండలంలోని వెంగంవారిపల్లె పంచాయతీ మడ్యంవారిపల్లె గ్రామస్తు లు తాగునీటి కోసం నెల రోజులుగా అవస్థలు పడుతున్నారు.

మడ్యంవారిపల్లెలో తాగునీటి సమస్య

నిమ్మనపల్లె, ఆగస్టు 9: నిమ్మనపల్లె మండలంలోని వెంగంవారిపల్లె పంచాయతీ మడ్యంవారిపల్లె గ్రామస్తు లు తాగునీటి కోసం నెల రోజులుగా అవస్థలు పడుతున్నారు. ఆదివారం ఆ గ్రామస్తులు విలేకరులతో మాట్లాడుతూ బోరు నెల రోజుల క్రితం పాడైనా పట్టిం చుకునే నాఽథుడే లేడని వాపోయారు. గ్రామస్తులు చందాలు వేసిస్తే బాగు చేయిస్తామని కార్యదర్శి లోకేశ్వరి నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి ఈ సమస్య తీర్చాలని వారు కోరుతున్నారు. 


Updated Date - 2020-08-10T11:19:02+05:30 IST