రజినీకాంత్‌పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం

ABN , First Publish Date - 2020-10-14T18:04:12+05:30 IST

ప్రభుత్వ పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించినందుకు జరిమానా విధించాల్సి ఉంటుందని రజినీని కోర్టు హెచ్చరించింది. అయితే ఈ కేసును విత్‌డ్రా చేసుకోవడానికి తమకు కొంత సమయం కావాలని రజినీ కౌన్సిల్ కోర్టును కోరింది.

రజినీకాంత్‌పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం

చెన్నై: గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ తనకు 6.5 లక్షల రూపాయల ఆస్తి పన్ను విధించడంపై నటుడు రజినీకాంత్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. చెన్నైలోని తన ప్రాపర్టీ రాఘవేంద్ర కళ్యాణ మండపంపై ఈ పన్ను చెల్లించాలని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ నోటీసులు పంపింది. అయితే కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించిన మార్చి 24 నుంచి రాఘవేంద్ర కళ్యాణ మండపం మూసివేసి ఉందని, అప్పటి నుంచి ఎలాంటి ఆదాయం లేనందున గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ విధించిన ఆస్తి పన్ను చెల్లించలేమని రజినీ తరపు లాయర్ మద్రాస్ హైకోర్టుకు తెలిపారు. కాగా ఈ విషయమై మద్రాస్ హైకోర్టు జడ్జి అనిత సుమంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించినందుకు జరిమానా విధించాల్సి ఉంటుందని రజినీని కోర్టు హెచ్చరించింది. అయితే ఈ కేసును విత్‌డ్రా చేసుకోవడానికి తమకు కొంత సమయం కావాలని రజినీ తరపు లాయర్ కోర్టును కోరారు.

Updated Date - 2020-10-14T18:04:12+05:30 IST