మహిళా ఏఎస్సైని కాల్చి.. ఆపై తనను కాల్చుకున్న Madhya Pradesh Cop
ABN , First Publish Date - 2022-06-25T02:07:32+05:30 IST
తన సహోద్యోగి అయిన మహిళా ఏఎస్సైపై కాల్పులు జరిపిన ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ పై తనను తాను పాయింట్
భోపాల్: తన సహోద్యోగి అయిన మహిళా ఏఎస్సైపై కాల్పులు జరిపిన ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ పై తనను తాను పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చుకుని మృతి చెందాడు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ పోలీస్ కంట్రోల్ రూము ప్రాంగణంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. తనను తాను కాల్చుకున్న ఇన్స్పెక్టర్ను హకమ్ సింగ్ పవార్గా పోలీసులు గురించారు.
హకమ్ సింగ్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మహిళా ఏఎస్ఐని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్టు ఇండోర్ పోలీస్ కమిషనర్ హరినారాయణాచారి మిశ్రా తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరపుతున్నామని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.