మదనాపురం పట్టణంగా అభివృద్ధి చెందుతోంది
ABN , First Publish Date - 2022-05-27T05:36:30+05:30 IST
నూతన మండల ఆవిర్భావ అనంతరం మదనాపురం పట్టణంగా అభివృద్ధి చెందుతోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.
- వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
- రూ.66లక్షలతో మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభం
మదనాపురం, మే 26 : నూతన మండల ఆవిర్భావ అనంతరం మదనాపురం పట్టణంగా అభివృద్ధి చెందుతోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలో మార్కెటింగ్ శాఖకు సంబంధించి రూ.66లక్షలతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్, తిర్మలాయపల్లె గ్రామంలో మన ఊరు, మన బడి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచన మేరకు చివరి నిమిషంలో మదనాపురం నూతన మండలంగా ఆవిర్భవించిందని అన్నారు. మండల ఏర్పాటు అనంతరం అనేక ప్రభుత్వ కార్యాలయాలు రావడం జరిగిందన్నారు. వ్యవసాయ మార్కెట్కు నెలవారి ఆదాయం వచ్చే విధంగా కాంప్లెక్స్కు కేవలం 90 రోజుల్లో నిర్మించడం అభినందనీయమని అన్నారు. త్వరలో బహిరంగ వేలం ద్వారా షాపులను కేటాయిస్తామని తెలిపారు. అంతకు ముందు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో మార్కె ట్ చైర్మన్ బాలనారాయణ, జడ్పీటీసీలు కృష్ణయ్యయాదవ్, వామన్గౌడ్, ఎంపీపీలు జన్నుపద్మావతి, గుంతమౌనిక, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బిట్లియాదగిరి, సర్పంచ్ రాంనారాయణ, సింగిల్ విండో చైర్మన్లు వంశీధర్రెడ్డి, వాసుదేవారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వాసురెడ్డి, అంజియా దవ్, కోట్ల తిరుపతయ్య, కురుమూర్తి, శివశంకర్ పాల్గొన్నారు.