మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధరలు!
ABN , First Publish Date - 2021-03-01T16:05:37+05:30 IST
దేశీయ చమురు సంస్థలు మరోమారు వంటగ్యాస్...
న్యూఢిల్లీ: దేశీయ చమురు సంస్థలు మరోమారు వంటగ్యాస్ వినియోగదారుల నడ్డివిరిచాయి. తాజాగా వాణిజ్య సిలిండర్ ధరలు కూడా పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. వంటగ్యాస్పై 25 రూపాయలు, వాణిజ్య సిలిండర్పై 95 రూపాయలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెంచిన ధరలు ఈరోజు(సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి.
కాగా గడచిన మూడు నెలల వ్యవధిలో గ్యాస్ సిలిండర్ ధర 225 రూపాయల వరకూ పెరగడం గమనార్హం. 2020, డిసెంబర్ 1న సిలిండర్ ధర 594 రూపాయల నుంచి రూ.644కి పెరిగింది. ఆ తరువాత జనవరి 1న 644 రూపాయల నుంచి 694కు పెంచారు. ఫిబ్రవరి 4న ఇది 719 రూపాయలకు చేరింది. మళ్లీ ఫిబ్రవరి 15న మరో 50 రూపాయలు పెంచడంతో 769 రూపాయలకు చేరింది. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర 819 రూపాయలకు చేరింది. ఇక వాణిజ్య సిలిండర్ ధర 95 రూపాయలు పెంచడంతో, ఇప్పుడు సిలిండర్ ధర 1,614 రూపాయలకు చేరింది. ఇదేవిధంగా పెట్రోల్, డీజిల్ ధరలు సైతం అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి.