రాత్రివేళ ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు.. ఆమెను మెడపైకి తీసుకెళ్లి దారుణం..!

ABN , First Publish Date - 2022-07-09T20:19:01+05:30 IST

ఆ యువతి,యువకుడు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి అతడు తన ప్రేయసి ఇంట్లోకి వెళ్లాడు. ఆమెను మేడపైకి తీసుకెళ్లి.. దారుణానికి పాల్పడ్డాడు. పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో స్థాని

రాత్రివేళ ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు.. ఆమెను మెడపైకి తీసుకెళ్లి దారుణం..!

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువతి,యువకుడు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి అతడు తన ప్రేయసి ఇంట్లోకి వెళ్లాడు. ఆమెను మేడపైకి తీసుకెళ్లి.. దారుణానికి పాల్పడ్డాడు. పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులంగా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 



బిహార్‌కు చెందిన కాజల్ కుమారి(18), గోపాల్ కుమార్(32).. పాట్నా ప్రాంతంలోని ఓ గ్రామంలో నివసిస్తున్నారు. ఇళ్లు ఎదురెదురే కావడంతో.. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే తర్వాత ప్రేమగా మారింది. దీంతో కొద్ది రోజులుగా ఇద్దరూ ప్రేమాయణం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం  రాత్రి గోపాల్ కుమార్.. కాజల్ ఇంటికి వెళ్లాడు. అనంతరం ఆ యువతిని మేడపైకి తీసుకెళ్లాడు. అనంరతం ఇద్దరి మధ్యా ఏదో విషయమై.. వివాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన గోపాల్ కుమార్.. తన దగ్గర ఉన్న తుపాకీతో కాజల్ కుమారి కాల్చేశాడు. అనంతరం తాను కూడా కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కాగా.. పేలుడు శబ్దం రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వెంటనే ఇంటిపైకి పరుగులు తీశారు. రక్తపు మడుగులో ఉన్న ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. యువకుడి వద్దకు తుపాకీ ఎలా వచ్చింది. ఆ ఇద్దరూ ఏ విషయంలో గొడవపడ్డారనే విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 


Updated Date - 2022-07-09T20:19:01+05:30 IST