కూతురితో గదిలో పట్టుబడిన ప్రియుడు.. ఆగ్రహంతో దాడి చేసి మర్మాంగాలను కోసిన కుటుంబ సభ్యులు.. ఆ తర్వాత..

ABN , First Publish Date - 2021-07-26T03:09:05+05:30 IST

ప్రియురాలిని కలవడం కోసం పక్క ఊరికెళ్లాడా యువకుడు. అదే అతను చేసిన తప్పు. అతను ప్రియురాలితో మాట్లాడుతూ ఆమెతో ఉండగా.. ప్రేయసి తండ్రి సడెన్‌గా అక్కడకు చేరుకున్నాడు.

కూతురితో గదిలో పట్టుబడిన ప్రియుడు.. ఆగ్రహంతో దాడి చేసి మర్మాంగాలను కోసిన కుటుంబ సభ్యులు.. ఆ తర్వాత..

ఇంటర్నెట్ డెస్క్: ప్రియురాలిని కలవడం కోసం పక్క ఊరికెళ్లాడా యువకుడు. అదే అతను చేసిన తప్పు. అతను ప్రియురాలితో మాట్లాడుతూ ఆమెతో ఉండగా.. ప్రేయసి తండ్రి సడెన్‌గా అక్కడకు చేరుకున్నాడు. కుమార్తెతో కలిసి ఉన్న యువకుడిని చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆయన అరుపులకు మిగతా కుటుంబ సభ్యులు కూడా అక్కడకు చేరుకున్నారు. అందరూ కలిసి సదరు యువకుడిపై దాడికి దిగారు. కిందపడేసి కుళ్లబొడిచారు. అక్కడితో ఆగకుండా పదునైన కత్తి తీసుకొచ్చి ఆ యువకుడి మర్గాంగాలను కోసేశారు. దీంతో తీవ్రమైన రక్తస్రావం జరిగి ఆ యువకుడు స్పృహ కోల్పోయాడు. అప్పుడు తమకేమీ తెలియనట్లు ఆస్పత్రిలో చేర్పించి చేతులు దులుపుకున్నారు. ఈ ఘటన బిహార్‌లోని ముజఫ్ఫర్ పూర్‌లో సంచలనం సృష్టిస్తోంది.


స్థానికంగా ఉన్న సోన్‌బరసా గ్రామంలోని ఒక యువతిని సౌరభ్ కుమార్ (22) ప్రేమిస్తున్నాడు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ప్రేమాయణం సాగుతోంది. ఈ క్రమంలోనే శుక్రవారం తన ప్రేయసిని చూడటం కోసం సౌరభ్ ఆమె గ్రామానికి వెళ్లాడు. అక్కడే ఆమె కుటుంబ సభ్యులు సౌరభ్‌పై దాడి చేశారు. మర్మాంగాన్ని కోసేసి స్పృహలేని స్థితిలో ఉండగా అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడు సౌరభ్ కుటుంబానికి సమాచారం అందించారు. చికిత్స పొందుతూ సౌరభ్ మరణించాడు. అమ్మాయి కుటుంబమే దాడి చేసి, తమ బిడ్డను చంపేశారని సౌరభ్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని, గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ప్రతిరోజూ గస్తీ తిరుగుతున్నామని తెలిపారు.

Updated Date - 2021-07-26T03:09:05+05:30 IST