చెట్టును ఢీకొన్న లారీ
ABN , First Publish Date - 2021-03-04T05:19:48+05:30 IST
మండల కేంద్రంలోని స్థానిక బస్టాండు కూడలిలో మంగళవారం అర్ధరాత్రి ఓ లారీ చెట్టును, విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న సంఘటనలో పెను ప్రమాదం తప్పి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం జరిగింది.
నందలూరు, మార్చి3 : మండల కేంద్రంలోని స్థానిక బస్టాండు కూడలిలో మంగళవారం అర్ధరాత్రి ఓ లారీ చెట్టును, విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న సంఘటనలో పెను ప్రమాదం తప్పి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం జరిగింది. ప్రొద్దుటూరు నుంచి చెన్నైకి ధనియాల లోడుతో వెళుతున్న లారీ బస్టాండు కూడలిలో నిలబడి ఉన్న ఓ బుల్లెట్ను, చెట్టును, విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు బుల్లెట్ వద్ద ఉన్న ఇద్దరు వ్యక్తులు అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి బయటపడ్డారు. లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో ఎస్ఐ లక్ష్మీప్రసాద్రెడ్డి డ్రైవర్ను కాపాడారు. గాయపడ్డ లారీ డ్రైవర్ను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.