శ్రీకృష్ణుడు రోజూ కలలో కనిపిస్తున్నాడు : అఖిలేశ్ యాదవ్

ABN , First Publish Date - 2022-01-04T17:04:50+05:30 IST

శ్రీకృష్ణుడు రోజూ తన కలలో కనిపిస్తున్నాడని, రానున్న

శ్రీకృష్ణుడు రోజూ కలలో కనిపిస్తున్నాడు : అఖిలేశ్ యాదవ్

లక్నో : శ్రీకృష్ణుడు రోజూ తన కలలో కనిపిస్తున్నాడని, రానున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధిస్తుందని, ప్రభుత్వాన్ని, రామరాజ్యాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్తున్నాడని ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే మాధురి వర్మ సమాజ్‌వాదీ పార్టీలో చేరిన సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అఖిలేశ్ ఈ విషయం చెప్పారు. మాధురి వర్మ కుర్మి సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత. ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. 


మాధురి వర్మను పార్టీలో చేర్చుకున్న సందర్భంగా అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ, సామ్యవాదం (సమాజ్‌వాద్) ద్వారానే రామరాజ్యం స్థాపన జరుగుతుందని చెప్పారు.  రాష్ట్రంలో సమాజ్‌వాద్ ప్రభుత్వం ఏర్పడిననాడే రామరాజ్యం ఏర్పాటవుతుందని తెలిపారు. శ్రీకృష్ణుడు ప్రతి రోజూ రాత్రి తనకు కలలో కనిపిస్తున్నాడని, తన ప్రభుత్వమే రాబోతోందని చెప్తున్నాడని తెలిపారు. 


రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌కు పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు తరలిరావడాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ఫెయిలైన విద్యార్థులకు తమ తల్లిదండ్రులు సాయపడేవిధంగా యోగి ఆదిత్యనాథ్‌కు బీజేపీ పెద్దలు సాయపడుతున్నారని చెప్పారు. బీజేపీ క్రిమినల్స్, మాఫియా శక్తులను ప్రక్షాళన చేయడానికి వాషింగ్ మెషిన్‌ను ఆ పార్టీ కొన్నదేమోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-01-04T17:04:50+05:30 IST