కొనసాగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2020-02-20T05:53:58+05:30 IST
మండల పరిధిలోని అయ్యసాగర్ శ్రీ త్రిపురాంత కేశ్వర వీరభద్రస్వామి దేవాలయంలో శివకోఠి జపయజ్ఞం, 22వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు, శివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి.
ఆమనగల్లు : మండల పరిధిలోని అయ్యసాగర్ శ్రీ త్రిపురాంత కేశ్వర వీరభద్రస్వామి దేవాలయంలో శివకోఠి జపయజ్ఞం, 22వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు, శివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని శోభాయామానంగా అలంకరించారు. ఉత్సవాలలో భాగంగా రెండో రోజు బుధవారం విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచనం, ప్రణవ పతాకావిష్కరణ, అఖండ దీపారాధన, కలశ స్థాపన రుద్రాభిషేకం, సర్వదేవత పూజలు, శివ పంచాక్షరి, లలిత సహస్రనామం , శివగీత , భగ వద్గీత పరాయాణం, దేవ యజ్ఞం, సత్యనారాయణ స్వామి వ్రతాలు కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కర్నాకర్ రెడ్డి, కల్లు వెంకట్ రెడ్డి, ఎన్.టీ పంచాక్షరి, మల్లప్ప, భట్టు నర్సిరెడ్డి, గోవింద్ యాదయ్య, వీరయ్య, యాదగిరిరెడ్డి, శ్రీనునాయక్, వైద్యనాథ్, జగన్మోహన్ రెడ్డి, అర్చకులు నాగరాజు, చంద్రశేఖర్, శేఖరయ్య, తదితరులున్నారు.