లేపాక్షి ఆలయ ప్రధానార్చకుడి శివైక్యం

ABN , First Publish Date - 2022-08-20T05:16:00+05:30 IST

ప్రసిద్ధి చెందిన లేపాక్షి దుర్గావీరభద్రస్వామి ఆలయ ప్రధానార్చకుడు సూర్యప్రకాశరావు (63) శుక్రవారం తెల్లవారుజామున శివైక్యం చెందారు.

లేపాక్షి ఆలయ ప్రధానార్చకుడి శివైక్యం
అర్చకుడు సూర్య ప్రకాశరావు (ఫైల్‌)

లేపాక్షి, ఆగస్టు 19: ప్రసిద్ధి చెందిన లేపాక్షి దుర్గావీరభద్రస్వామి ఆలయ ప్రధానార్చకుడు సూర్యప్రకాశరావు (63) శుక్రవారం తెల్లవారుజామున శివైక్యం చెందారు. 42 ఏళ్లుగా ఆయన.. దుర్గా వీరభద్రస్వామి ఆలయ అర్చకుడిగా పనిచేస్తున్నారు. ఆయన హఠాన్మరణంతో ఆలయంలో శుక్రవారం పూజలు నిలిపివేసినట్లు ఏఓ నరసింహమూర్తి తెలిపారు. సూర్యప్రకాశ రావుకు భార్య, కుమార్తె ఉన్నారు.



Updated Date - 2022-08-20T05:16:00+05:30 IST