13న లోక్ అదాలత్
ABN , First Publish Date - 2022-08-11T06:12:21+05:30 IST
ల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ఈనెల 13న జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి బుధవారం తెలిపారు.
అన్ని న్యాయస్థానాల్లో నిర్వహణ
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి
ఒంగోలు (కలెక్టరేట్), ఆగస్టు 10 : జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ఈనెల 13న జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజీపడదగిన అన్ని క్రిమినల్, సివిల్, వివాహ సంబంధ, చెక్బౌన్స్, వాహన బీమా పరిహారం చెల్లింపు కేసులకు సంబంధించి ఇరువర్గాల వారు వచ్చి ఎటువంటి ఖర్చులేకుండా వారి న్యాయవాదుల సమక్షంలో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ప్రధానంగా చెల్లని చెక్కు కేసుల్లో ఇరువర్గాల వారిని పిలిపించి సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని ఆమె పేర్కొన్నారు. వివాహ సంబంధ వ్యాజ్యాలలో దంపతుల ఇరువురికీ కౌన్సెలింగ్ ఇప్పించి వారిని కలిపేందుకు చొరవ తీసుకుంటామని తెలిపారు.