సూరత్ లో కరోనాతో రెండో మృతి...

ABN , First Publish Date - 2020-04-05T15:47:36+05:30 IST

గుజరాత్ లోని సూరత్ లో కరోనా బారిన పడిన 61 ఏళ్ల రజనీబెన్ లిలానీ అనే మహిళ మృతిచెందింది. అంతకుముందు రజినీబెన్...

సూరత్ లో కరోనాతో రెండో మృతి...

సూరత్ : గుజరాత్ లోని  సూరత్ లో కరోనా బారిన పడిన 61 ఏళ్ల రజనీబెన్ లిలానీ అనే మహిళ మృతిచెందింది. అంతకుముందు రజినీబెన్ లిలానీకి వైద్యపరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్‌గా తేలింది. దీనితో ఆమెను మిషన్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. రిపోర్ట్ వచ్చిన కొద్ది గంటల్లోనే ఆ మహిళ మృతి చెందింది. సూరత్ నగరంలోని కరోనా కారణంగా రెండవ మరణం చోటు చేసుకుంది. ఆ మహిళ  వేరొకరి ద్వారా కరోనా పాజిటివ్‌గా మారింది. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో సంక్షోభం నెలకొంది. దేశంలో ఇప్పటివరకు 3000 కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 


Updated Date - 2020-04-05T15:47:36+05:30 IST