కంటైన్ మెంట్ జోన్లలో 7 రోజులపాటు లాక్ డౌన్: సీఎం మమత

ABN , First Publish Date - 2020-07-09T00:59:42+05:30 IST

కంటైన్ మెంట్ జోన్లలో 7 రోజులపాటు లాక్ డౌన్: సీఎం మమత

కంటైన్ మెంట్ జోన్లలో 7 రోజులపాటు లాక్ డౌన్: సీఎం మమత

కోల్ కతా: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా కంటైన్ మెంట్ జోన్లలో 7 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తామని సీఎం మమతాబెనర్జీ వెల్లడించారు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 7 రోజుల పాటు కంటైన్ మెంట్ జోన్లలో లాక్ డౌన్ విధించబడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని కంటైన్ మెంట్ జోన్లలో లాక్ డౌన్ 7 రోజులు కొనసాగుతుందని, ఏడు రోజుల తరువాత పరిస్థితిని సమీక్షించి తదుపరి చర్యలను తీసుకుంటామని సీఎం మమత తెలిపారు.

Updated Date - 2020-07-09T00:59:42+05:30 IST