కరోనా ఇబ్బందులను అధిగమించేందుకు రుణాలు

ABN , First Publish Date - 2021-02-28T06:40:32+05:30 IST

కరోనా మూలంగా కలిగిన నష్టాల నుంచి ఇబ్బందుల నుంచి కొంతలో కొంత ఆదుకు నేందుకు చిరు, వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణా లు మంజూరుచేస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనో హర్‌రెడ్డి అన్నారు.

కరోనా ఇబ్బందులను అధిగమించేందుకు రుణాలు
రుణ మంజూరు పత్రాలను అందజేస్తున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

- ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి 

- వీధి వ్యాపారులకు పత్రాలు అందజేత

సుల్తానాబాద్‌, ఫిబ్రవరి 27: కరోనా మూలంగా కలిగిన నష్టాల నుంచి ఇబ్బందుల నుంచి కొంతలో కొంత ఆదుకు నేందుకు చిరు, వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణా లు మంజూరుచేస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనో హర్‌రెడ్డి అన్నారు. సుల్తానాబాద్‌ పట్టణంలో శనివారం వీధి వ్యాపారుల సదస్సు ఏర్పాటు చేశారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పథకం ద్యారా రుణా మేళాను అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ కరోనా వలన చిరు వ్యాపా రులకు తీరని నష్టం కలిగిందని వీరిని ఆదుకోవడానికి కేంద్ర ప్రభు త్వం ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియా న్‌ పథకం ద్వారా వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున ఇస్తోంద న్నారు. వీటిని సద్వినియోగం చేసు కోవాలన్నారు. మున్సిపాలిటీ పరిధి లో మొత్తం 1,241 మంది రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్నారని, అందరికి విడతల వారీగా రుణాలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముత్యం సునీ తరమేష్‌గౌడ్‌, వైస్‌చైర్‌పర్సన్‌ బిరుదు సమత క్రిష్ణ, కమిష నర్‌ శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు నాయకులు గుర్రాల శ్రీనివాస్‌, పారుపల్లి గుణపతి, పసెడ్ల సంపత్‌, సాజీద్‌, తిరుపతి తది తరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T06:40:32+05:30 IST