జీవనోపాధి మెరుగుపరుచుకోవాలి

ABN , First Publish Date - 2020-12-05T05:16:05+05:30 IST

సంఘాల్లో ఉన్న మహిళలు జీవనోపాధి మెరుగుపరుచుకోవాలని స్త్రీనిధి జిల్లా మేనేజర్‌ కె.రాము తెలిపారు.

జీవనోపాధి మెరుగుపరుచుకోవాలి
కంప్యూటర్‌లో వివరాలు చూస్తున్న స్త్రీనిధి జిల్లా మేనేజర్‌ రాము

కవిటి: సంఘాల్లో ఉన్న మహిళలు జీవనోపాధి మెరుగుపరుచుకోవాలని స్త్రీనిధి జిల్లా మేనేజర్‌ కె.రాము తెలిపారు. శుక్రవారం కవిటి వెలుగు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో 20,750 మంది సభ్యులకు రూ103.75 కోట్లు రుణ లక్ష్యంకాగా 16,636 మంది సభ్యులకు రూ.82.79 కోట్ల రుణాలు అందజేసినట్లు తెలిపారు. మిగిలిన వారికి సకాలంలో ఇవ్వాలని సూచించారు. మహిళా సంఘాల్లో దివ్యాం గులు ఉంటే రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. జిల్లా స్త్రీనిధి రికవరీ 97.65శాతం ఉంటే  కవిటి మండలం జిల్లాలో 97.96 శాతంతో మూడో స్థానంలో ఉందని చెప్పారు.ఫ ఇచ్ఛాపురంరూరల్‌: వైఎస్సార్‌ చేయూత పథకంతో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని ఏపీఎం ఎస్‌.ప్రసాదరావు తెలిపారు.శుక్రవారం ఇచ్ఛాపురంలోని వెలుగు కార్యాలయంలో వీవోఏలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మాట్లా డుతూ, మండలంలోని 40 మంది మహిళలకు గతంలో జమచేసిన  రూ.18750తో లబ్ధిదారుల ఆదాయాభివృద్ధి పెంచేందుకు దోహద పడతాయని తెలిపారు. గొర్రెలు, మేకలు యూనిట్‌ విలువ రూ.75 వేలతో అందించేందుకు పశుసంవర్థక శాఖ, సచివాలయ సిబ్బందితో నమన్వయంగా అర్హులు, అర్హతలు గుర్తించి బ్యాంకు రుణం అందజేస్తారని చెప్పారు.

   


Updated Date - 2020-12-05T05:16:05+05:30 IST