Libraries: రూ.287 కోట్లతో గ్రంథాలయాల ఆధునికీకరణ
ABN , First Publish Date - 2022-09-14T13:36:34+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాల్లో అంధులకు ఆధునిక వసతులు, అరుదైన పుస్తకాలు డిజిటలైజేషన్ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం కొత్త పథకం
ప్యారీస్(చెన్నై), సెప్టెంబరు 13: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాల్లో అంధులకు ఆధునిక వసతులు, అరుదైన పుస్తకాలు డిజిటలైజేషన్ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం కొత్త పథకం రూపొందించింది. రాష్ట్రంలో 4,650 గ్రంథాలయాలు(Libraries)న్న నేపథ్యంలో, విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచే దిశగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ గ్రంథాలయాలను రూ.287 కోట్లతో ఆధునికీకరించేందుకు చర్యలు మొదలయ్యాయి. గ్రంథాలయాల్లో పాఠకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అంతేకాకుండా, పుస్తకాలపై ఆసక్తి కలిగిన అంధులకు సహకరించే విధంగా ఆడియో పుస్తకం, పిల్లల్లో పఠనాసక్తి పెంచేలా కొరట్టూరులోని అన్నా సెంటినరీ లైబ్రరీలో ఆడిటోరియం, కాన్ఫరెన్స్ తదితరాలను ఆధునిక వసతులతో పరిచయం చేయనున్నట్లు గ్రంథాలయ విభాగం అధికారులు తెలిపారు.