కరోనాతో మృతి చెందిన టీడీపీ కార్యకర్తలను ఆదుకుంటాం
ABN , First Publish Date - 2021-07-25T06:21:11+05:30 IST
కరోనాతో మృతిచెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామని మాజీ ఎమ్యెల్యే, మదనపల్లె నియోజకవర్గ పార్టి ఇన్చార్జి దొమ్మలపాటి రమేష్ పేర్కొన్నారు. శనివారం నిమ్మనపల్లె, ముష్టూరు పంచాయతీల్లో కరోనాతో మృతి చెందిన కుంటుబాలను ఆయన పరామర్శించారు.
మాజీ ఎమ్యెల్యే, మదనపల్లె నియోజకవర్గ పార్టి ఇన్చార్జి దొమ్మలపాటి
నిమ్మనపల్లె, జూలై 24: కరోనాతో మృతిచెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామని మాజీ ఎమ్యెల్యే, మదనపల్లె నియోజకవర్గ పార్టి ఇన్చార్జి దొమ్మలపాటి రమేష్ పేర్కొన్నారు. శనివారం నిమ్మనపల్లె, ముష్టూరు పంచాయతీల్లో కరోనాతో మృతి చెందిన కుంటుబాలను ఆయన పరామర్శించారు. రెండో దశ కరోనాలో ఎంతో మంది టీడీపీ కార్యక్తలను పోగొట్టుకున్నామన్నారు. దిగువపల్లెకు చెందిన గోవింద్సింగ్, నిమ్మనపల్లెకు చెందిన రామ్మూర్తి కుటుంబాలను పరామర్శించారు. రెడ్డెప్పరెడ్డి, యశశ్విరాజ్, మల్లికార్జున, మునిరత్నం, విజయ్, చంద్ర, మల్లప్ప, చినబాబు, షఫి, ఖాసి, రమణ, శంకర తదితరులు పాల్గొన్నారు.