కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బొంద పెడదాం
ABN , First Publish Date - 2022-08-14T05:18:09+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బొందపెడదామని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ అన్నారు.
అయిజ, ఆగస్టు 13: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బొందపెడదామని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ అన్నారు. శనివారం అయిజ మండల పరిధిలోని యాపదిన్నె గ్రామం నుంచి స్వాతంత్య్ర గౌరవ్ పాదయాత్రను ప్రారంభించారు. అనం తరం అయిజ పట్టణంలోని కొత్త బస్టాండు ముందు ప్రజలను ఉద్దేశించి సంపత్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికం చేపట్టిన నాటి నుంచి అన్ని రకాల వస్తువులపై ధరలు పెంచారన్నారు. బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను మోసగి స్తూ కుటుంబ పాలనతో కేసీఆర్ లబ్ధిపొందుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో తప్ప ఇప్పటి వరకు ప్రజలకు చేసిందిలేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక పాలనతో ఇప్పటికే ప్రజలు విసిగిపోయారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ప్రజలు మద్దతు తెలుపాలని కోరారు. అలాగే కౌన్సిలర్ షేక్షావలిఆచారి, తిప్పన్న, అడ్వకేట్ మధు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్ దేవరాజు, నాయకులు మద్దిలేటి, జయన్న, బార్కి దేవన్న, దేవేంద్ర, లాల్గౌడు పాల్గొన్నారు.