ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్దాం

ABN , First Publish Date - 2020-10-20T05:51:54+05:30 IST

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్దామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ పిలుపునిచ్చారు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్దాం

బీజేపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ 


జడ్చర్ల, అక్టోబరు 19: రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్దామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ పిలుపునిచ్చారు. జడ్చర్ల మండ లం పోలేపల్లి గ్రామంలో సోమవారం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, పట్టభద్రుల ఓటరు జాబితాలో పేరు నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని, చరమగీతం పాడే సమ యం ఆసన్నమైందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన అనంతరం మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే చెల్లిందని విమర్శించారు. కార్యక్రమంలో రాపోతుల శ్రీనివాస్‌గౌడ్‌, మాచారంచారి, కరాటేశ్రీను, సామల నర్సిములు, రేలింగ్‌నాగరాజు, యాదయ్య, ఇబ్రహీం, శేఖర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-20T05:51:54+05:30 IST