రాంగోపాల్‌రెడ్డిని గెలిపించుకుందాం

ABN , First Publish Date - 2022-07-04T05:07:16+05:30 IST

టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఉమా మహేశ్వర నాయుడిని రాయలసీమ గ్రాడ్యుయేషన ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగో పాల్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

రాంగోపాల్‌రెడ్డిని  గెలిపించుకుందాం
ఉమామహేశ్వరనాయుడిని సన్మానిస్తున్న భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి

ఉమాతో  టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భేటీ

కంబదూరు (కళ్యాణదుర్గం), జూలై 3: టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఉమా మహేశ్వర నాయుడిని రాయలసీమ గ్రాడ్యుయేషన ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగో పాల్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం కళ్యాణదుర్గం పట్టణంలోని ఉమా నివాసంలో  మర్యాదపూర్వకంగా కలిసి ఉమాను ఘనంగా సన్మానించారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరనాయుడు మాట్లాడు తూ.. గ్రాడ్యుయేషన ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక గ్రాడ్యుయేట్‌ అభ్యర్థులను ఎక్కువగా ఓటర్లుగా నమోదు చేయించి పార్టీ అభ్యర్థి అయిన భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డిని గెలిపించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ నాయకులు, పలువురు ఎమ్మెల్సీ అభ్యర్థిని కలిసిన వారిలో ఉన్నారు. 


Updated Date - 2022-07-04T05:07:16+05:30 IST