నకిలీ వకీల్ సాబ్
ABN , First Publish Date - 2021-01-14T07:07:40+05:30 IST
న్యాయస్థానానికి చెందిన నకిలీ ఉత్తర్వులు సృష్టించి మోసం చేసిన నకిలీ న్యాయవాదిని బుధవారం ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచారు.
హైదరాబాద్/కొత్తపేట : న్యాయస్థానానికి చెందిన నకిలీ ఉత్తర్వులు సృష్టించి మోసం చేసిన నకిలీ న్యాయవాదిని బుధవారం ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచారు. కర్ణాటక రాయిచూర్, శివ్రాజ్ కాం పౌండ్కు చెందిన ప్రభాకర్ శివ్రాజ్ సంపతి అలియాస్ పి. శివ్రాజ్ (55) సైదాబాద్ సుబ్రమణ్యనగర్ కాలనీలో ఉంటూ న్యాయవాదిగా చెలామణి అయ్యేవాడు.
దిల్సుఖ్నగర్ పీఅండ్టీ కాలనీలో ఉండే జి. శ్యాంసుందర్కు చెంగిచర్లలో ఓపెన్ప్లాట్లు, శైలజ ప్రిమియర్ అపార్టుమెంట్కు సబంధించిన షాపు లు ఉన్నాయి. సదరు షాపులు, ప్లాట్కు సంబంధించి వివాదా లు ఉండటంతో ఆయన పి. శివ్రాజ్ ద్వారా గతేడాది జులై 20న రంగారెడ్డి జిల్లా కోర్టులను ఆశ్రయించారు. కొన్నాళ్లకు శ్యాంసుందర్ కేసుకు సంబంధించి శివ్రాజ్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చా డు. తర్వాత అవి నకిలీవని తేలడంతో శ్యాంసుందర్.. శివ్రాజ్ను ప్రశ్నించాడు. దీంతో తప్పుని శివరాజ్ అంగీకరించాడు. పలు ఫీజుల కింద శివ్రాజ్కు చాలాసార్లు డబ్బులు చెల్లించానని, న్యాయం చేయాలని బాధితుడు ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించాడు.
ఆయన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తెలంగాణ హైకోర్టు బార్కౌన్సిల్ను సంప్రదించారు. దీంతో శివ్రాజ్ న్యాయవాది కాదని తేలింది. నిందితుడు నకిలీ ఇంజక్షన్ ఆర్డర్లు ఇచ్చాడని సైబరాబాద్ జేఎ్ఫఎం ప్రత్యేక మొబైల్ కోర్టు కం 6వ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కం 6వ అడిషనల్ ఎంఎం కోర్టు నివేదిక ఇచ్చింది. ఆధారాలను సేకరించిన అనంతరం నిందితుడు శివ్రాజ్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామని ఎస్హెచ్ఓ అశోక్రెడ్డి తెలిపారు.