న్యాయవాదులను ఆర్థికంగా ఆదుకోవాలి
ABN , First Publish Date - 2020-07-09T10:56:58+05:30 IST
న్యాయవాదులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షడు ఎస్.రమేష్ కోరారు. జిల్లా కేంద్రంలో గల అసోసియేషన్ భవనంలో బుధవారం
కలెక్టరేట్ : న్యాయవాదులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షడు ఎస్.రమేష్ కోరారు. జిల్లా కేంద్రంలో గల అసోసియేషన్ భవనంలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా విజృంభణతో కోర్టుల కార్యకలాపాలు నిలిచి పోయాయని, దీంతో పనిలేక ఇబ్బంది పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాదుల సంక్షేమ నిధి నుంచి ప్రభుత్వం కొంత మొత్తాని కరోనా సాయం గా అందించాని కోరారు. కార్యదర్శి గడ్డాపు శ్రీకృష్ణ ప్రసాద్, న్యాయవాదులు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.