సీహెచ్సీలో కరోనా టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం
ABN , First Publish Date - 2020-08-11T10:17:07+05:30 IST
స్థానిక సీహెచ్సీలో సోమవారం కరోనా టెస్టింగ్ ల్యాబ్ను ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడు ప్రారంభించారు.
బొబ్బిలి: స్థానిక సీహెచ్సీలో సోమవారం కరోనా టెస్టింగ్ ల్యాబ్ను ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడు ప్రారంభించారు. ప్రజల నుంచి వచ్చి వినతుల మేరకు కలెక్టర్తో మాట్లాడి ఈ ల్యాబ్ను మంజూరు చేయించినట్లు ఆయన తెలిపారు. ఇందులో రోజుకు 60 మందికి ట్రూనాట్ పరీక్షలు జరిపేం దుకు అవకాశముందని వైద్యాధికారి డాక్టర్ జి.శశిభూషణరావు చెప్పారు. టీమ్ లీడరు, మూడు షిఫ్టుల్లో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు, ముగ్గురు జూనియర్ డాక్టర్లు విధులు నిర్వహిస్తారన్నారు. నోడల్ అధికారి డాక్టర్ వై.విజయమోహన్, శోభారాణి, హరిప్రసాద్, ఆనంద్, అనూష, వైసీపీ నేతలు శంబంగి వేణు గోపాలనాయుడు, కృష్ణమూర్తి, బి.సత్యనారాయణ, ఉమాశంకర్ పాల్గొన్నారు.