లష్కర్‌వారం బుకింగ్‌ ఆదాయం రూ.40.89లక్షలు

ABN , First Publish Date - 2022-01-25T05:49:30+05:30 IST

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ బ్రహ్మోత్సవా ల్లో భాగంగా ఇటీవల ముగిసిన లష్కర్‌ వారాన్ని పురస్కరించుకుని భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

లష్కర్‌వారం బుకింగ్‌ ఆదాయం రూ.40.89లక్షలు

చేర్యాల, జనవరి 24: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ బ్రహ్మోత్సవా ల్లో భాగంగా ఇటీవల ముగిసిన లష్కర్‌ వారాన్ని పురస్కరించుకుని భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. కేవలం మూడురోజుల్లో రూ.40,89,726ఆదాయం సమకూరింది. మేడారం భక్తుల రద్దీతో జాతరకు హాజరైన భక్తులు మొక్కుబడులుగా తలనీలాలు, పట్నాలు, బోనాలు, ఆర్జితసేవలు నిర్వహించారు. వీటితో పాటుప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, వసతిగదుల అద్దె తదితరాల ద్వారా శనివారం రూ.3,08,462, ఆదివారం రూ.32,34,302, సోమవారం రూ.5,46,962 చొప్పున బుకింగ్‌ ఆదాయం సమకూరింది. గతేడాది లష్కర్‌వారం సందర్భంగా మూడు రోజుల్లో రూ.40.16లక్షల ఆదాయం రాగా, ఈ ఏడాది స్వల్పంగా పెరిగింది.

Updated Date - 2022-01-25T05:49:30+05:30 IST