బైక్‌ను ఢీకొన్న లారీ.. చిన్నారి దుర్మరణం

ABN , First Publish Date - 2022-05-18T05:42:22+05:30 IST

బైక్‌ను ఢీకొన్న లారీ.. చిన్నారి దుర్మరణం

బైక్‌ను ఢీకొన్న లారీ.. చిన్నారి దుర్మరణం

  • తల్లిదండ్రులకు గాయాలు


కొత్తూర్‌, మే 17: బైక్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో చిన్నారి మృతిచెందగా తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. ఈ ఘటన కొత్తూర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని బైపాస్‌ రహదారిపై నాట్కో చౌరస్తా వద్ద మంగళవారం చోటు చేసుకుంది. కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామానికి చెందిన ప్రశాంత్‌రెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. వేసవి సెలవుల నిమిత్తం 15రోజుల క్రితం కుటుంబసభ్యులతో స్వగ్రామానికి వచ్చారు. మంగళవారం తన బైక్‌పై భార్య దివ్యారెడ్డి, కూతురు ఇవికారెడ్డి(4)తో కలిసి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. నాట్కో చౌరస్తా వద్ద షాద్‌నగర్‌ నుంచి కొత్తూర్‌కు వస్తున్న ఇటుకల లారీ అతివేగంగా వచ్చి బైక్‌ను వెనుక నుంచి ఢీకొనడంతో చిన్నారి ఇవికారెడ్డి లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ప్రశాంత్‌రెడ్డి, దివ్యారెడ్డిలకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. కళ్ల ముందే కూతురు దుర్మరణం చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో పాటిగడ్డ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దివ్యారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శంకర్‌ తెలిపారు. 

Updated Date - 2022-05-18T05:42:22+05:30 IST