లారీ ఢీకొని ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-02-20T09:51:53+05:30 IST

కృష్ణపట్నం పోర్టు రహదారిలో బుధవారం లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.

లారీ ఢీకొని ఒకరి మృతి

గ్రామస్థులు ఆందోళన


ముత్తుకూరు, ఫిబ్రవరి19: కృష్ణపట్నం పోర్టు రహదారిలో బుధవారం లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెంకటాచలం మండలం పుంజులూరుపాడుకు చెందిన మానికల మునెయ్య (49) పోర్టుకు వెళ్లే లారీ ఢీకొని సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పామాయిల్‌ ఫ్యాక్టరీలో పనిచేసేందుకు వెళ్తున్న మునెయ్యను సరయూ ఫ్యాక్టరీ ఎదురుగా పోర్టు వెళ్లే లారీ ఢీకొన్నది. వేగంగా వెళ్తున్న లారీ ఢీకొనడంతో మునెయ్య శరీరం పూర్తిగా చిధ్రమై రోడ్డుపై పడిపోయింది. మునెయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మునెయ్య మృతి విషయం తెలిసి పుంజులూరుపాడు గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న ముత్తుకూరు ఎస్సై అంజిరెడ్డి తమ సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న గ్రామస్థులతో మాట్లాడి, మునెయ్య కుటుంబానికి న్యాయం చేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చి, గ్రామస్థులు ఆందోళనను విరమింపజేశారు. అనంతరం మునెయ్య మృతదేహానికి పంచనామా నిర్వహించి, శవపరీక్ష నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-02-20T09:51:53+05:30 IST