భూదాన్‌ భూములు స్వాధీనం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-02-25T05:13:18+05:30 IST

భూదాన్‌ భూములు స్వాధీనం చేసుకోవాలి

భూదాన్‌ భూములు స్వాధీనం చేసుకోవాలి
అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌కు వినతి పత్రం అందజేస్తున్నసీపీఎం నాయకులు

వికారాబాద్‌(ఆంధ్రజ్యోతి)/పరిగి : పరిగి మండలం, నారాయణపూర్‌ రెవెన్యూ పరిధిలో అన్యాక్రాంతమైన 32.22 ఎకరాల భూదాన్‌ భూమితో పాటు ఆ భూముల్లో ఉన్న స్టీల్‌ ఫ్యాక్టరీని వెంటనే స్వాధీనం చేసుకోవాలని సీపీఎం నాయకులు జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. సంబంధిత అధికారులు ఆక్రమణకు గురైన భూదాన్‌ భూములను వెంటనే స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించాలన్నారు. కార్యక్రమంలో హబీబ్‌, నారాయణ, శ్రీను పాల్గొన్నారు.  నారాయణపూర్‌ గ్రామంలో కబ్జాకు గురైన భూదాన్‌ భూములను విడిపించాలని కోరుతూ, సర్పంచ్‌ ఆధ్వర్యంలో బుధవారం ఆర్డీవో కేవీ ఉపేందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో  కాంగ్రెస్‌ నాయకులు బందెయ్య, సుధాకర్‌రెడ్డి, కిష్టయ్య, యాదయ్య, పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T05:13:18+05:30 IST