భూ సారపరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలి
ABN , First Publish Date - 2020-02-20T05:39:37+05:30 IST
రైతులు భూసార పరీక్షలు చేయించుకుని... వాటి ఆధారంగా ఎరువులు వాడాలని కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధీర్బాబు పేర్కొన్నారు.
యాచారం: రైతులు భూసార పరీక్షలు చేయించుకుని... వాటి ఆధారంగా ఎరువులు వాడాలని కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధీర్బాబు పేర్కొన్నారు. బుధవారం ప్రపంచ భూసార పరీక్ష పత్రం దినం సందర్భంగా మండలంలోని మొగ్గుళ్లవంపు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో కేంద్రీయ మెట్టవ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ విద్యాశేఖర్, ఇబ్రహీంపట్నం వ్యవసాయ శాఖ ఏడీఏ సత్యనారాయణ, మండల రైతు సమన్వయ సమితి చైర్మెన్ కె.జోగిరెడ్డి, మొగ్గుళ్లవంపు గ్రామ రైతు సమన్వయ సమితి చైర్మెన్జగన్మోహన్రెడ్డి, మండల వ్యవసాయాదికారి సందీ్పకుమార్, వ్యవసాయ శాఖ విస్తరణాధికారులు గాయత్రి, పురుషఫోత్తమ్ ఉన్నారు.