భూ సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-08-11T05:02:28+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం భూసమస్యలు తక్షణమే పరిష్కరించాలని,

భూ సమస్యలు పరిష్కరించాలి
ధర్నాలో మాట్లాడుతున్న జాన్‌వెస్లీ

మంచాల, ఆగస్టు 10 : రాష్ట్ర ప్రభుత్వం భూసమస్యలు తక్షణమే పరిష్కరించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని రాష్ట్ర కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పి.యాదయ్య హెచ్చరించారు. మంచాల మండలంలో భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం తహసీల్దారు కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దారుకు అందించారు. ధర్నాలో సీపీఎం మండల కార్యదర్శి ఎన్‌.శ్యాంసుందర్‌, ఆర్‌.జంగయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, నహీదాబేగం, రమాకాంత్‌రెడ్డి, ఆవుల యాదయ్య, బుగ్గరాములు, ఆర్‌.స్వామి, జంగయ్య తదితరులున్నారు.  



Updated Date - 2022-08-11T05:02:28+05:30 IST