లాలూ ప్రసాద్ యాదవ్‌కి బెయిల్

ABN , First Publish Date - 2021-04-17T18:40:06+05:30 IST

దాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కి ఎట్టకేలకు...

లాలూ ప్రసాద్ యాదవ్‌కి బెయిల్

పాట్నా: దాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కి ఎట్టకేలకు బెయిల్ లభించింది. దుంకా ట్రెజరీ కేసులో రాంచీ హైకోర్టు ఇవాళ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కాగా దాణా కుంభకోణానికి సంబంధించి మొత్తం నాలుగు కేసుల్లో లాలూ నిందితుడిగా ఉన్నారు. 1990ల్లో దుంకా ట్రెజరీ నుంచి లాలూ అక్రమంగా రూ. 3.13 కోట్లు విత్ డ్రా చేశారంటూ నమోదైన కేసులో... సీబీఐ కోర్టు ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 60 లక్షల జరిమానా విధించింది. 

Updated Date - 2021-04-17T18:40:06+05:30 IST