కనులపండువగా లక్ష్మీచెన్నకేశవస్వామి తిరుకల్యాణం
ABN , First Publish Date - 2022-05-17T05:11:03+05:30 IST
కనులపండువగా లక్ష్మీచెన్నకేశవస్వామి తిరుకల్యాణం
కందుకూరు,మే16: ఊట్లపల్లి దేవుని గుట్టపై ఉన్న శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి తిరు కల్యాణం సోమవారం కనులపండువగా జరిగింది. ఉదయం స్వామివారికి ఛత్స్థాన పూజ, నవగ్రహ వాస్త్తుపూజలు, సుదర్శన హోమం నిర్వహించారు. మధ్యాహ్నం స్వామివారి వేద పండితులు రాజుశర్మ నేతృత్వంలో పండితులు స్వామివారి తిరుకల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణాన్ని తిలకించడానికి ముచ్చర్ల, ఊట్లపల్లి గ్రామస్తులతో పాటు దాసర్పల్లి, కందుకూరు, కడ్తాల, సాయిరెడ్డిగూడ, అల్మాస్పల్లి గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షడు బొక్క నర్సింహారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి, బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములుయాదవ్, కొత్తగూడ సర్పంచ్ సాధ మల్లారెడ్డి, ముచ్చర్ల మాజీ సర్పంచ్ తేరటి లక్ష్మణ్ముదిరాజ్, ముచ్చర్ల ఎంపీటీసీ సభ్యుడు మల్లేష్, నాయకులు మాధవరెడ్డి, ఎస్.భూమిరెడ్డి, కిషన్ తదితరులు పాల్గొన్నారు.