ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు

ABN , First Publish Date - 2022-08-20T06:05:29+05:30 IST

మండలంలో సుమారు పది వేల ఎకరాల్లో వరి సాగు చేశా రు. సాధారణ నాట్లకంటే వరి నాట్ల వల్ల చీడపీ డల బెడద ఎక్కువగా ఉండదని రైతులు తెలి పారు.

ఇతర రాష్ట్రాల నుంచి  కూలీలు
కోటకొండ సమీపంలో వరి నాట్లు వేస్తున్న ఉత్తరప్రదేశ్‌ కూలీలు

 రుద్రవరం, ఆగస్టు 19: మండలంలో సుమారు పది వేల ఎకరాల్లో వరి సాగు చేశా రు. సాధారణ నాట్లకంటే వరి నాట్ల వల్ల చీడపీ డల బెడద ఎక్కువగా ఉండదని రైతులు తెలి పారు. దిగుబడి ఎకరాకు 40 నుంచి 45 బస్తా లు వస్తాయని అన్నారు. అయితే సాలు వరి నాట్లకు మండలంలోని గ్రామాల్లో కూలీల కొర త తీవ్రంగా ఉంది. దీంతో ఉత్తరప్రదేశ్‌, జార్ఖం డ్‌, చత్తీస్‌గడ్‌ రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది కూలీలు నాట్లు వేయడానికి వలస వచ్చారు. ఒక్కో ఎకరాకు రూ.3,800 నుంచి రూ.4 వేలు కూలి తీసుకుం టూ సాలు వరి నాట్లు వేస్తున్నారు. మామూలుగా స్థానికంగా మహిళా కూలీలు వరి నాట్లలో పాల్గొంటారు. కూలీల కొరత రావడంతో వలస వచ్చిన మగ కూలీలు నాట్ల పనిలోకి దిగారు. 


Updated Date - 2022-08-20T06:05:29+05:30 IST