ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు తెరవాలి

ABN , First Publish Date - 2020-12-01T05:27:25+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు తెరవాలి

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు తెరవాలి

వికారాబాద్‌: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు తెరవాలని కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి ఆర్‌.మహిపాల్‌, ఎంవీఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ జిల్లా నాయకులు శ్రీనివాస్‌, నర్సింహులు, వెంకటయ్య అన్నారు. సోమవారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్‌ చౌరాస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద విద్యార్థుల పట్ల, వారి చదువు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు.  వెంటనే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు తె రిచి ఉచిత బస్సు సౌకర్యం, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు అందించాలని, స్కాలర్‌షి్‌పలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌,  నాయకులు వెంకటయ్య, శ్రీనివా్‌స లు, నర్సింహులు, రాములమ్మ, లక్ష్మి, రంగారెడ్డి, బాలయ్య, ఆశాలత తదితరులు  పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-01T05:27:25+05:30 IST