రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని స్వాగతిస్తున్నా..: కేవీపీ

ABN , First Publish Date - 2021-12-15T19:59:18+05:30 IST

రోశయ్య స్మృతివనం ఏర్పాటు చేయాలన్న రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని స్వాగతిస్తున్నానని కేవీపీ అన్నారు.

రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని స్వాగతిస్తున్నా..: కేవీపీ

హైదరాబాద్: దివంగత మాజీ సీఎం రోశయ్య స్మృతివనం ఏర్పాటు చేయాలన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని స్వాగతిస్తున్నానని కేవీపీ రామచంద్రరావు అన్నారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య సంస్మరణ సభ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హైకమాండ్ ఆదేశంతో సందేహించకుండా సీఎం పదవికి రాజీనామా చేసిన వ్యక్తి రోశయ్య అని అన్నారు. సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాతనే రోశయ్య ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణవార్త ప్రపంచానికి తెలియజేయాల్సి వచ్చినప్పుడు రోశయ్య మనో వేదనకు గురయ్యారని అన్నారు. రోశయ్య సమర్థత మీద నమ్మకంతో వైఎస్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. వైఎస్ జిల్లాల పర్యటనకు వెళ్తే.. ఏ కొత్త పథకం హామీ ఇస్తారనే భయం రోశయ్యలో ఉండేదని కేవీపీ వ్యాఖ్యానించారు.


Updated Date - 2021-12-15T19:59:18+05:30 IST