కొవిడ్‌తో కుషి న్యూరో మైండ్స్‌ అధినేత మృతి

ABN , First Publish Date - 2021-05-12T07:11:19+05:30 IST

కొవిడ్‌తో చికిత్స పొందుతూ ప్రముఖ సైకియాట్రిస్ట్‌, కుషి న్యూరో, మైండ్స్‌ ఆస్పత్రి అధినేత డాక్టర్‌ బీవీ రాజారావు మంగళవారం మృతి చెందారు.

కొవిడ్‌తో కుషి న్యూరో మైండ్స్‌ అధినేత మృతి
రాజారావు (ఫైల్‌ఫొటో)

తిరుపతి, మే 11 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌తో చికిత్స పొందుతూ ప్రముఖ సైకియాట్రిస్ట్‌, కుషి న్యూరో, మైండ్స్‌ ఆస్పత్రి అధినేత డాక్టర్‌ బీవీ రాజారావు మంగళవారం మృతి చెందారు. వారం కిందట కొవిడ్‌ బారినపడిన ఆయన స్థానిక ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో చెన్నైకు తరలించారు. ఈ క్రమంలో బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో మృతి చెందినట్టు నిర్ధారించారు. సామాజిక అంశాలపై అవగాహన కల్పించే వ్యక్తిగా నగరవాసులకు చిరపరిచయస్తులు. ఈయన మృతిపట్ల పలువురు వైద్యులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తిరుపతి గోవిందధామంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Updated Date - 2021-05-12T07:11:19+05:30 IST