వైసీపీ మాటల ప్రభుత్వంగానే మిగిలింది: కోట్ల సూర్య ప్రకాష్

ABN , First Publish Date - 2021-03-02T15:53:33+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై కేంద్రమాజీమంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి విరుచుకుపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వంగానే మిగిలిందని వ్యాఖ్యానించారు.

వైసీపీ మాటల ప్రభుత్వంగానే మిగిలింది: కోట్ల సూర్య ప్రకాష్

కర్నూలు: వైసీపీ ప్రభుత్వంపై కేంద్రమాజీమంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి విరుచుకుపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వంగానే మిగిలిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై ప్రజల్లో నుంచి వ్యతిరేకత మొదలైందన్నారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం నాలుగు ప్రాజెక్టుల నిర్మాణానికి చంద్రబాబు నిధులు విడుదల చేశారని గుర్తుచేశారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే దమ్ము వైసీపీ ఎమ్మెల్యేలకు లేదన్నారు.  ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడిగే దైర్యం వైసీపీ నాయకులు లేదని విమర్శించారు. పోలీసులు ఖాకీ డ్రస్సు తీసేసి, వైసీపీ డ్రస్సు వేసుకుంటే బాగుంటుందని కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి హితవుపలికారు.

Updated Date - 2021-03-02T15:53:33+05:30 IST