కర్నూలులో మంత్రి బుగ్గన పర్యటన
ABN , First Publish Date - 2020-10-31T15:40:45+05:30 IST
ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు.
కర్నూలు: ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సంకల్ బాగ్, రాఘవేంద్ర మట్ పుష్కర ఘాట్లలో నిర్మాణ పనులను, డ్రైనేజీ పనులను మంత్రి తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పాల్గొన్నారు.