కర్నూలు : బెడ్ కోసం 22 గంటల పాటు ఎదురుచూసి...

ABN , First Publish Date - 2020-08-09T03:50:19+05:30 IST

కర్నూలు : జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్య సిబ్బంది

కర్నూలు : బెడ్ కోసం 22 గంటల పాటు ఎదురుచూసి...

  • ప్రభుత్వాస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం

కర్నూలు : జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. పూర్తి వివరాల్లోకెళితే శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు ఆదోనికి చెందిన రిటైర్డ్ ఎస్సై షాషా వలి ఆస్పత్రికి వచ్చారు. అయితే బెడ్లు లేవని చెప్పిన ఆస్పత్రి సిబ్బంది ఆస్పత్రిలో అడ్మిషన్ చేయించుకోలేదు. దీంతో నిన్న రాత్రి 9 నుంచి ఇవాళ సాయంత్రం ఏడు గంటల వరకు అంటే 22 గంటల పాటు కారులోనే ఆక్సిజన్ పెట్టుకుని అడ్మిషన్ కోసం నిరీక్షించారు.


ఆస్పత్రిలో చేర్చుకోకపోవడంతో చేసేదేమీ లేక రిటైర్డ్ ఎస్సైను కుటుంబీకులు ఆదోని నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఇంతవరకూ ఆస్పత్రి ఇంతవరకూ స్పందించకపోవడం గమనార్హం.

Updated Date - 2020-08-09T03:50:19+05:30 IST