కర్నూలులో గణేష్ శోభాయాత్ర ప్రారంభం
ABN , First Publish Date - 2021-09-18T17:05:36+05:30 IST
జిల్లాలోని రాంబోట్ల దేవాలయంలో గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది.
కర్నూలు: జిల్లాలోని రాంబోట్ల దేవాలయంలో గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, మేయర్ బివై రామయ్య, విహెచ్ పి నేత రాఘవరెడ్డి ఆలయంలో వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి శోభయాత్రను ప్రారంభించారు. ఓల్డ్ టౌన్, కొండారెడ్డి బురుజు, కోట్ల సర్కిల్, పెద్ద పార్కు, రాజవిహార్, కలెక్టరేట్ మీదుగా వినాయక ఘాట్కు శోభాయాత్ర చేరుకోనుంది. మధ్యాహ్నం 12 గంటల తరువాత వినాయక నిమజ్జనం ప్రారంభం కానుంది. డీజే, మైకులు లేకుండా శోభాయాత్ర కొనసాగుతోంది.