చనిపోయిన మహిళకు రెండో డోస్..
ABN , First Publish Date - 2021-09-13T21:13:27+05:30 IST
కర్నూలు: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది బతికున్నవారికే కాదు.. చనిపోయినవారికీ టీకాలు వేస్తున్నారు.
కర్నూలు: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది బతికున్నవారికే కాదు.. చనిపోయినవారికీ టీకాలు వేస్తున్నారు. చాగలమర్రిలో రెండవ వార్డుకు చెందిన పెద్ద లక్ష్మిదేవీకి జూన్ 1న వైద్య సిబ్బంది మొదటి డోసు వేశారు. అయితే ఆమె అనారోగ్యానికి గురై జూన్ ఆరో తేదీన మృతి చెందింది. ఈ క్రమంలోనే నిన్న చాగలమర్రిలో వైద్య సిబ్బంది మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. లక్ష్మిదేవి రెండో డోసు వేసుకున్నట్లు సెల్ ఫోన్కు మెసేజ్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు.