Kurnool: బాత్రూమ్లో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-01-16T18:00:41+05:30 IST
శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో దుగ్గాని బీరయ్య(41) అనే వ్యక్తి బాత్రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో దుగ్గాని బీరయ్య(41) అనే వ్యక్తి బాత్రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే శ్రీశైలం టూటౌన్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిర్వహించేందుకు సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.