కర్నూలులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
ABN , First Publish Date - 2021-10-18T16:59:03+05:30 IST
జిల్లాలోని ఆలూరు మండలం అరికేర గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
కర్నూలు: జిల్లాలోని ఆలూరు మండలం అరికేర గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మొన్న జరిగిన దేవరగట్టు కర్రలసమరంలో తమ వర్గం వారిపై దాడి చేశారని నెపంతో ఈరోజు ఉదయం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.