శ్రీశైలంలోని భారత్ పెట్రోల్ బంక్‌లో దొంగనోట్ల కలకలం

ABN , First Publish Date - 2021-10-06T17:38:55+05:30 IST

శ్రీశైలంలోని భారత్ పెట్రోల్ బంక్‌లో దొంగనోట్ల కలకలం రేగింది.

శ్రీశైలంలోని భారత్ పెట్రోల్ బంక్‌లో దొంగనోట్ల కలకలం

కర్నూలు: శ్రీశైలంలోని భారత్ పెట్రోల్ బంక్‌లో దొంగనోట్ల కలకలం రేగింది. పెట్రోల్ పోయించుకున్న  యాత్రికులు..పెట్రోల్ బంక్ సిబ్బందికి రెండువందల నోట్లు, వందనోట్లు దొంగ నోట్లు ఇచ్చి వెళ్లారు. కొద్దిసేపటికి దొంగనోట్లను గుర్తించిన పెట్రోల్ బంక్ సిబ్బంది కారు నంబర్ గుర్తించి కారును వెంబడించి పట్టుకున్నారు. యాత్రికుల వద్ద ఇంకా కొన్ని దొంగనోట్లు ఉన్నట్లు సిబ్బంది  గుర్తించింది. అయితే కారులో ఉన్న యాత్రికులు దొంగనోట్లు చింపేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పెట్రోల్ బంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-10-06T17:38:55+05:30 IST