కర్నూలులో వ్యక్తిపై ఇనుపరాడ్లతో దాడి

ABN , First Publish Date - 2021-02-25T16:01:53+05:30 IST

జిల్లాలోని బనగానపల్లె మండలం నందివర్గంలో గడ్డల సుబ్బారావు(35)అనే వ్యక్తి పై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు.

కర్నూలులో వ్యక్తిపై ఇనుపరాడ్లతో దాడి

కర్నూలు: జిల్లాలోని బనగానపల్లె మండలం నందివర్గంలో గడ్డల సుబ్బారావు(35)అనే వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. ఇనుప రాడ్లు, కర్రలతో సుబ్బరావుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గడ్డల సుబ్బారావును హత్య చేసేందుకే దాడి చేశారని బంధువులు ఆరోపించారు. తీవ్రంగా గాయపడిన సుబ్బారావును చికిత్స నిమిత్తం  బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు విచారణ చేపట్టారు. 

Updated Date - 2021-02-25T16:01:53+05:30 IST