జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్కు భారీగా వరద
ABN , First Publish Date - 2021-09-13T13:36:14+05:30 IST
శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచి వరద నీటి ప్రవహం కొనసాగుతోంది.
కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచి వరద నీటి ప్రవహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఇన్ ప్లో 78,226 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 31,784 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా..ప్రస్తుత నీటిమట్టం 881.60 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటినిల్వ 197.0114 టీఎంసీలుగా నమోదు అయ్యింది. మరోవైపు శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.