రోడ్డు ప్రమాంలో కూలీ మృతి
ABN , First Publish Date - 2020-11-29T06:00:16+05:30 IST
మండలంలోని మనబాలవానిపాలెం హైవే జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కూలీ దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్ర గాయాలకు గురయ్యారు.
మరో నలుగురికి గాయాలు
నక్కపల్లి, నవంబరు 28 : మండలంలోని మనబాలవానిపాలెం హైవే జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కూలీ దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్ర గాయాలకు గురయ్యారు. ఇందుకు సంబంధించి ఎస్ఐ అప్పన్న తెలిపిన వివరాలివి. మనబాలవానిపాలేనికి చెందిన 10 మంది కూలీలు శుక్రవారం చినదొడ్డిగల్లులో ఇంటి శ్లాబ్ నిర్మాణ పనుల కోసం ఆటోపై వెళుతూ.. వారివెంట మిల్లర్ను తీసుకు వెళ్లారు. అనంతరం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో వీరు తిరిగి వస్తుండగా, తమ గ్రామ హైవే జంక్షన్ వద్దకు వచ్చేసరికి మిల్లర్ను రాజమండ్రి నుంచి వస్తున్న వాన్ ఢీకొంది. దీంతో మిల్లర్ కూలీలు ఉన్న ఆటోపై పడడంతో బోల్తాపడింది. అందులో ఉన్న ఐదుగురు కూలీలకు గాయాలయ్యాయి. అనకాపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగేశ్వరరావు అనే కూలీ మృతి చెందినట్టు ఎస్ఐ చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.