29 నుంచి కేటీఆర్ గోల్డ్కప్ క్రికెట్ పోటీలు
ABN , First Publish Date - 2021-01-25T06:23:49+05:30 IST
గోదావరిఖనిలో ఈనెల 29 నుంచి విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేటీఆర్ గోల్డ్కప్ క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్టు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు.
కళ్యాణ్నగర్, జనవరి 24: గోదావరిఖనిలో ఈనెల 29 నుంచి విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేటీఆర్ గోల్డ్కప్ క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్టు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ఆదివారం మార్కండేయకాలనీలోని ఒక ఫంక్షన్హాల్లో కోరుకంటి ప్రీయర్ లీగ్ కేటీఆర్ గోల్డ్కప్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు రూ.50,116, రన్నరప్కు రూ.25,116 నగదు బహుమతిని అందించనున్నట్టు ఆయన చెప్పారు. పోటీలో పాల్గొనే వారు 9885730490నంబర్లో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో మేయర్ అనిల్కుమార్, కార్పొరేటర్లు అడ్డాల స్వరూప, కుమ్మరి శ్రీను, టీఆర్ఎస్ నాయకులు పాతిపెల్లి ఎల్లయ్య, అడ్డాల రామస్వామి, బొడ్డు రవీందర్, నూతి తిరుపతి, కళావతి, జాన్ కెనడి, జితేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.