అలరించిన శ్రీకృష్ణార్జున విలాపం పౌరాణిక నాటకం
ABN , First Publish Date - 2021-11-28T05:14:50+05:30 IST
అలరించిన శ్రీకృష్ణార్జున విలాపం పౌరాణిక నాటకం
షాద్నగర్ రూరల్: రాష్ట్ర సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జనతాసేవా సమితి ఆధ్వర్యంలో శనివారం రాత్రి షాద్నగర్లో యోగా కేంద్రంలో ప్రదర్శించిన శ్రీకృష్ణార్జున విలాపం పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించారు. వరకవుల నరహరిరాజు రచన, సంగీతం, దర్శకత్వంలో ప్రదర్శించిన ఈ నాటకంలో శ్రీకృష్ణుడిగా వీడీఎస్ రాజు నటన చూపరులను ఆకట్టుకుంది. మయసభలో ధుర్యోధనుడికి జరిగిన అవమానం గూర్చి దుర్యోధనుడి పాత్రధారి కాశన్న పాత్రకు రక్తికట్టించారు. సుభద్రగా మాధురి, సత్యభామగా ఇందిర, రుక్మిణి పాత్రలో కీర్తి, కర్ణుడిగా చిల్వేరు వెంకటయ్య నటించారు. రాష్ట్ర సర్పంచ్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రదర్శన దాత చక్కటి వెంకటే్షయాదవ్, వీహెచ్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్, ఫిలిం సెస్సార్ బోర్డు కమిటీ సభ్యులు రంగయ్య, రమే్షచారి పాల్గొన్నారు.